సంగీత::G.K.వెంకటేష్
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల
పల్లవి::
కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా
చరణం::1
నెత్తురు చెమటగ పిండావమ్మా..నీ పాపలను బెంచావమ్మా
పెద్దకొడుకుపై నీ ఆశంతా..పేక మేడలా కూలిందమ్మా
పేక మేడలా కూలిందమ్మా
కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా
చరణం::2
యెల్ల సుఖాలు నీ కందించి..తల్లి తమ్ముడు వెళ్ళిపాయారూ
నిన్ను వలచిన నీ యిల్లాలే..నిందలు నీపై మోపిందీ
నిందలు నీపై...మోపిందీ
కలలెన్నో కన్నావయ్యా..కన్నీరే మిగిలిందయ్యా
విధిరాసిన రాతలకూ...తిరుగెన్నడు లేదయ్యా
చరణం::2
అన్నా చెల్లెల అనురాగం..అయినవారికే అనుమానం
చీడపురుగులూ చేసిన పనికీ..గూడే చెదిరిపోయిందమ్మా
గూడే...చెదిరిపోయిందమ్మా
కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా
No comments:
Post a Comment