Wednesday, October 27, 2010

క్షత్రియుడు--1990




క్షత్రియుడు--1990
సంగీతం::ఇళయరాజా 
రచన::రాజశ్రీ 
డైరెక్టర్::K.సుభాష్
గానం::స్వర్ణ లతా 
Starring :Vijayakanth, Bhanupriya, Revathi 

పల్లవి::

పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే
దేహం అదిరెను..మొహం విరిసేను
ప్రాయం మాటులో..మౌనం వేలిసేను
హృదయమే పిలిచేనే..చిగురాశలె..పలికేనే
పాటగా నాలో మధురాలు విరిసే

చరణం::1

వలపే తేనే నవ్వులజల్లై యెదలో కురిసే
తలపే కోటి చిందులేసే..అలలై మెరిసే.
వగలే కొసరి రాగమాలా..కదిలే వింత పాటలే
కోరే చిలిపి బాసలోనా..చిలికే లేత ధ్యాసలె
హృదయమే పిలిచేనే..చిగురాసలె..పలికేనే

పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే

చరణం::2

వయసే నేడు ఇంద్రధనుసై..కధలే పెంచే
మనసే గుండెలోన వేయి కలలే పంచె
కనులే నాకు జోల పాడే..యిది ఏ రాజా యోగమో
ఖసిగా..మనసు ఆలపించే..ఉరికే రాగ బంధమో
హృదయమే పిలిచేనే..చిగురాసాలే పలికేనే..నే..

పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే
దేహం అదిరెను..మొహం విరిసేను
ప్రాయం మాటులో..మౌనం వేలిసేను
హృదయమే పిలిచేనే..చిగురాశలె..పలికేనే
పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీ వేళా పరువాలు పరిచే

వింత సంసారం--1971

















సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::సావిత్రి,రమాప్రభ,జగ్గయ్య,రామ్మోహన్,రాజబాబు,చిత్తూర్ వి నాగయ్య,లీలారాణి.

పల్లవి::

కోనసీమ పల్లెలోన..గొప్పవారి ఇంటిలోన
పాపలాంటి మనసున్న..బాబుగారు
ఏ అన్నెమూ పున్నెమూ..ఎరగనివారు
ఎవరయ్యా వారెవరయ్యా..ఎవరయ్యా వారెవరయ్యా
కోనసీమ పల్లెలోన..గొప్పవారి ఇంటిలోన
గోవులాంటి ఇల్లాలు..ఉందమ్మా
ఏ అన్నెమూ పున్నెమూ..ఎరగదమ్మా
ఎవరమ్మా ఆమెవరమ్మా..ఎవరమ్మా ఆమెవరమ్మా 

చరణం::1

ముచ్చటైన మొదటి రాత్రి..మోమైనా చూడలేదు
వద్దకైనా చేరలేదు..ముద్దుమాట లాడలేదు
ముచ్చటైన మొదటి రాత్రి..మోమైనా చూడలేదు
పిల్లలా సిగ్గుపడి..చల్లగా జారాడు
మూలాన కూచొని..కునికిపాట్లుపడ్డాడు
ఎవరయ్యా..వారెవరయ్యా 

చరణం::2

మొదటి రాత్రి ముచ్చట్లు..ఏ బడిలో నేర్పలేదు
ఇల్లాలి సరసాలు..ఏచోటా చదవలేదు
మొదటి రాత్రి ముచ్చట్లు..ఏ బడిలో నేర్పలేదు
వలచీ వలపించే..చెలియలేదు నేటిదాక
అందుకే గదిలోన..కునికిపాట్లు పడ్డాడు
ఎవరమ్మా ఆమెవరమ్మా..ఎవరమ్మా ఆమెవరమ్మా 

చరణం::3

చుక్కతోనెలవంకను చూడలేదా
ఊహూ చిలుకను గోరింక పిలుచుకోదా 
కలువతో తుమ్మెద కలుసుకోదా
ఆ ఆ ఆ..కలువతో తుమ్మెద కలుసుకోదా 
వాటిని చూసైనా తెలుసుకోలేదా..ఆహా
శివుడు తన సగము పార్వతికిచ్చాడు
తిరుపతి వెంకన్న ఇరువురినీ వలచాడు
శివుడు తన సగము పార్వతికిచ్చాడు
విష్ణువు శ్రీదేవిని వెంట నిలుపుకున్నాడు
పద్మనాభుడు తనసతిని మనసులోన దాచాడు
శ్రీమద్రమారమణ గోవిందో హాయి
ఎవరయ్యా వారెవరయ్యా నేనమ్మా అతడు నేనమ్మా 

వింత సంసారం--1971




సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::సావిత్రి,రమాప్రభ,జగ్గయ్య,రామ్మోహన్,రాజబాబు,చిత్తూర్V.నాగయ్య,లీలారాణి.

పల్లవి::

నా కంటి పాప..నా యింటి దీపం
ఆనాడు ఈనాడు..యేనాడు నీవే
నీ కంట నీరు..నే చూడలేను
హృదయాన జ్వాల..రగిలేనులే 

చరణం::1

కష్టాలనన్నీ సౌఖ్యాలు..చేసి
కన్నీటినంతా పన్నీరు..చేసే
కులకాంత వొడిలో..తలవాల్చగానే 
స్వర్గాలు భువి పై..వాలేనులే 

అడ్డాలలోన..బిడ్డలేగాని
పెరిగేరు వారు..మరిచేరు మనను
వయసైనవారు..కోరేటి మమత
కరువాయె మనకు..బరువాయె బ్రతుకు
కరువాయె మనకు..బరువాయె బ్రతుకు

చరణం::2

చల్లంగ చూచే..ఇల్లాలితో
ఈ లోకాన ఎవరూ..సరిరారులే 
నాలోన సగమై..నా ప్రేమ జగమై
నా తోడు నీడై..నిలిచేవులే..ఏ..

నా కంటి పాప..నా యింటి దీపం
ఆనాడు ఈనాడు..యేనాడు నీవే
నీ కంటనీరు..నే చూడలేను..ఊఊ