Wednesday, October 03, 2007

బంగారు కలలు--1974



సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,లక్ష్మి,వహీదా రెహమాన్ ( హిందీ తార), ఎస్.వి.రంగారావు

పల్లవి::

మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ
మనసుకు మమతకు వెలువేలేదూ..ఏదీలేని బ్రతుకే చేదూ
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ

చరణం::1
    
నీకు తెలుసు నిన్నెందుకు..ఆదరంచినానో
నీకు తెలుసు నిన్నెందుకు..ఆదరంచినానో
నాకు తెలుసు నన్నెందుకు..దూరంచేశావో
తెలియని దొకటే మనకు..లోకం విసిరిన యీ బాకు
ఎంత గాయం చేస్తుందో..ఎవరి బ్రతుకు ఏమౌతుందో    
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ

చరణం::2

అనుమానానికి అనురాగాన్నే..బలిచేశావూ
అనుమానానికి అనురాగాన్నే..బలిచేశావూ
నీకిచ్చిన మనసు ఎంత స్వచ్చమ్మో..ఎరుగక నిందించావూ
నిజమన్నది నిప్పువంటిది..నివురు గప్పి అది వుంటుందీ
ఎవరి గుండెలో ఎంత రగులుతుందో..ఏమి మిగులుతుందో        
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ

చరణం::3

నాకు తెలుసు ఆప్తులే..శత్రువులౌతారని
నాకు తెలుసు ఆప్తులే..శత్రువులౌతారని
నీకు తెలుసు..సంఘానికి కళ్ళేలేవని
తెలియని దేదీలేదూ..తెలిసీ ఫలితం లేదూ
మనసుకు మరుపేలేదూ..ఏదీలేని బ్రతుకే చేదూ    
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ
మనసుకు మమతకు వెలువేలేదూ..ఏదీలేని బ్రతుకే చేదూ
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ