Monday, July 27, 2015

మూగమనసులు--1964



సంగీతం::K..V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,గుమ్మడి,నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో..ఓ..ఓ
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో..ఓ..ఓ
ఈనాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ

చరణం::1 

మబ్బులు కమ్మిన ఆకాశం
మనువులు కలసిన మనకోసం
మబ్బులు కమ్మిన ఆకాశం
మనువులు కలసిన మనకోసం
చలువల పందిరి వేసింది 
తొలి వలపుల చినుకులు చిలికింది
చలువల పందిరి వేసింది 
తొలి వలపుల చినుకులు చిలికింది
ఈనాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ

చరణం::2 

నీ జతలో..చల్లదనం నీ ఒడిలో..వెచ్చదనం
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
అనుభవించి దినం దినం పరవశించనా
పరవశించి క్షణంక్షణం కలవరించనా
ఈనాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ

చరణం::3

ఎవరు పిలిచారనో..ఏమి చూడాలనో
ఎవరు పిలిచారనో..ఏమి చూడాలనో
ఉప్పొంగి ఉరికింది..గోదావరీ..గోదావరి
చెలికాని సరసలో..సరికొత్త వధువులో
చెలికాని సరసలో..సరికొత్త వధువులో
తొలినాటి భావాలు..తెలుసుకోవాలని
ఉప్పొంగి ఉరికింది..గోదావరీ
ఈనాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ