Thursday, March 25, 2010

దసరాబుల్లోడు--1971








సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల 
తారాగణం::నాగేశ్వర రావ్ , వాణీశ్రీ , చంద్రకళ 

వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా 

వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా 
వెళ్ళిపోతున్నావా..అమ్మా

చరణం::1

నువ్వే అమ్మని అన్నే నాన్నని అల్లారుముద్దుగా పెరిగానే
ఈ లోకం ఎరుగక బాధే తెలియక పసిపాపడిలా పెంచారే
అమ్మా ఏమై పోవాలి..నేనెలా బ్రతకాలి

వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా 

చరణం::2

పంపకాలే తలవంపులనీ..రెండు యిళ్ళను కలుపుతాననీ
పెంపక మిచ్చారానాడు..ఆ దత్తే నేడు నా దేవుళ్ళను
నడివీధికీ లాగిందమ్మా..నవ్వుల పాలు చేసిందమ్మా 

వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా 

చరణం::3

ప్రాణం దేహం విడిపోతున్నవి..పాలమనసూ కన్నీరైనది
ఎవరో పెట్టిన అనలం రగిలీ..యిందరి మమతలు బలికోరినదీ
అమ్మా ఏమై  పోవాలి..నేనింకెలా బ్రతకాలి 
నేఇంకెలా బ్రతకాలి..ఎలా బ్రతాకాలీ..

No comments: