సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::కృష్ణ,రాంమ్మోహన్,సుకన్య,సంధ్యరాణి,
రాధాకుమారి,వేంకటేశ్వరరావ్
పల్లవి::
ఈ ఉదయం..నా హృదయం
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది
ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ...
చరణం::1
పడుచు పిల్ల పయ్యెదలా..పలుచని వెలుగు పరచినది
పడుచు పిల్ల పయ్యెదలా..పలుచని వెలుగు పరచినది
కొండల కోనల మలుపుల్లో..కొత్త వంపులు చూపినది
ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ..
చరణం::2
చిగురాకులతో చిరుగాలీ..సరసాలాడి వచ్చినది
చక్కలిగింతలు పెట్టినదీ..వేసవికే చలి వేసినదీ
ఓ..ఓ..ఓహో..ఓ..ఓ..ఓహో..
ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ..
చరణం::3
సరస్సున జలకాలాడేదెవరో..తేటిని వెంట తిప్పేదెవరో
సరస్సున జలకాలాడేదెవరో..తేటిని వెంట తిప్పేదెవరో
రేయికి సింగారించే కలువో..పగలే వగలు రగిలే కమలమో
ఈ ఉదయం..నా హృదయం..
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది
ఈ ఉదయం..ఊ..ఊ..ఊ..ఊ
No comments:
Post a Comment