Saturday, September 11, 2010

మల్లమ్మ కథ--1973






సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి

పల్లవి::

భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా
దిక్కేలేనీ దీనులపాలిట..దిక్కై నిలిచిన దేవుడవయ్యా     
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా

చరణం::1

నీ భక్తులకు పెన్నిది నీవే..మా కన్నులలో ఉన్నది నీవే
నీ భక్తులకు పెన్నిది నీవే..మా కన్నులలో ఉన్నది నీవే
నిండుమనసుతో నీవారొసగే..నిండుమనసుతో నీవారొసగే 
గరికపూలకే..మురిసేవయ్యా
కన్నీటితోనే పూజించగానే..పన్నీరుగానే భావింతువయ్యా  
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా

చరణం::2

నందివాహనం వుందంటారే..కందిపోయే నీ కాళ్లెందుకయా
నందివాహనం వుందంటారే..కందిపోయే నీ కాళ్లెందుకయా
మంచుకొండ నీ ఇల్లంటారే..మంచుకొండ నీ ఇల్లంటారే
వొళ్ళంతాయీ..ఈ వేడెందుకయా
అన్నపూర్ణ నీ అండనుండగా..అన్నపూర్ణ నీ అండనుండగా 
ఆకలిబాధ..నీకెందుకయా     
భవహరణా..శుభచరణా..నాగాభరణా..గౌరీరమణా
దిక్కేలేనీ..దీనులపాలిట..దిక్కై నిలిచిన దేవుడవయ్యా     
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా

No comments: