Wednesday, July 25, 2007

దీక్ష--1951


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::M.S.రామారావు
తారాగణం::G.వరలక్ష్మి,రాంగోపాల్,శివరాం,రమణారెడ్డి,లీల,కమల,రాజ్యం,రాజేశ్వరి 

పల్లవి::

పోరా బాబూ పో
పోరా బాబూ పో
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో
ఆవేశాలను ఆశయాలను
వదిన కోసమే వదులుకొంటివా
ఆమెకు నీకు ఋణం తీరెగా
తెగించి చూడు తేలేదేమిటో
బాబూ పో..పోరా బాబూ పో

చరణం::1

ఉన్నవారు కాదన్నావో
ఊరు విడిచి పోతున్నావో
ఏ ఘనకార్యం సాధిస్తావో
ఏ ఘనకార్యం సాధిస్తావో
ఏమౌతావో ఎవరికెరుకరా
బాబూ పో..పోరా బాబూ పో

చరణం::2

దూరపు కొండలు నునుపేనేమో
దోషం నీలో లేదో ఏమో
నీవు నమ్మిన నీతి న్యాయం 
నీవు నమ్మిన నీతి న్యాయం 
నిజమౌనేమో తెలుసుకుందువో
బాబూ పో..పోరా బాబూ పో

చరణం::3

దేశసేవకై దీక్ష పూనమని
ధీరమాత దీవించెను నాన్న
కాకిని కోకిల చేస్తావో 
కాకిని కోకిల చేస్తావో  
లోకంలో ఒకడైపోతావో
పోరా బాబూ పో
పోరా బాబూ పో
పోయి చూడు ఈ లోకం పోకడ
పోరా బాబూ పో

No comments: