Wednesday, May 27, 2009

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,S,జానకి 
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::

ఏమని వేడాలీ..శరణం ఎవరిని కోరాలీ..ఈ
దీపముండీ చీకటైతే..దేవుడే కన్నెర్ర జేస్తే    
ఏమని వేడాలీ..శరణం ఎవరిని కోరాలీ..ఈ 

చరణం::1

మూగవోయిన వీణ..మళ్ళీ రాగ మొలికేనా..ఆ
మోడుబారిన మాను..తిరిగి చివురు తొడిగేనా..ఆ
ఏడుకొండలు స్వామి..కరుణించి నీవే
ఏడుకొండలు స్వామి కరుణించి నీవే..దారి చూపాలీ..ఈ
                                
ఏమని వేడాలీ..ఈ..శరణం ఎవరిని కోరాలీ..ఈ

చరణం::2

శ్రీశైల శిఖరాన..చెలువొందు భ్రమరాంబ
చింతలను బాపేటి..శ్రీ గౌరి జగదాంబ
శ్రీశైల శిఖరాన..చెలువొందు భ్రమరాంబ
చింతలను బాపేటి..శ్రీ గౌరి జగదాంబ
మాపైన నెనరుంచి..మల్లికార్జునునితో
మా మొర వినిపింపుమా..ఆఆఆ  
           
ఏమని వేడాలీ..శరణం ఎవరిని కోరాలీ..ఈ

No comments: