Saturday, November 21, 2009

బీదలపాట్లు--1972

























సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగయ్య, విజయలలిత

పల్లవి::

నేనెవరో తెలిసిందీ..నిజమేదో తెలిసిందీ
నిరాశతో తపియించే బ్రతుకున..ఆశారేఖ మెరిసిందీ         
నేనెవరో తెలిసిందీ..నిజమేదో తెలిసిందీ
నిరాశతో తపియించే బ్రతుకున..ఆశారేఖ మెరిసిందీ    

చరణం::1

నిరుపేదగ నే పుట్టాను..నిట్టూర్పులలో పెరిగాను
నిరుపేదగ నే పుట్టాను..నిట్టూర్పులలో పెరిగాను
చీకటి వెలుగుల పెనుగులాటయే..జీవితమని కనుగొన్నాను         
నేనెవరో..నే నెవరో తెలిసిందీ 

చరణం::2

కసిపెంచుకున్న నాగుండెను..కనీళ్ళతోనే కడిగాను
కసిపెంచుకున్న నాగుండెను..కనీళ్ళతోనే కడిగాను
ద్వేషం త్రుంచీ ప్రేమను పెంచీ..మనిషిగ జీవిస్తాను        
నేనెవరో..నే నెవరో తెలిసిందీ..ఈఈఈ  

చరణం::3

కూటికి కరువై కుమిలేవారికి..తోడు నీడగా ఉంటాను
కూటికి కరువై కుమిలేవారికి..తోడు నీడగా ఉంటాను
మానవసేవే మాధవసేవగా..నా బ్రతుకే తీర్చుకుంటాను    
నేనెవరో..నేనెవరో తెలిసిందీ 
నిరాశతో తపియించే బ్రతుకున..ఆశారేఖ మెరిసిందీ        
ఆశారేఖ మెరిసింది..ఆశారేఖ మెరిసింది ఆశారేఖ మెరిసింది

No comments: