Wednesday, September 07, 2011

గాంధీపుట్టినదేశం--1973




సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,పద్మనాభం,రాజబాబు,జానకి,జయంతి,రమాప్రభ,నిర్మల

పల్లవి::

ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి 
మూగ గుండెలో రగిలే బాధ మూగగానే మిగలాలి  
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి    

చరణం::1

సిరిమల్లెల విరియించే వసంతం..చిగురాకులనే రాల్చేస్తే 
సిరిమల్లెల విరియించే వసంతం..చిగురాకులనే రాల్చేస్తే 
నావను నడిపే చుక్కాని..ఆ..నావను తానే ముంచేస్తే  
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి     

చరణం::2
       
వలపులు పోసి పెంచిన తీవే..కాలసర్పమై కాటేస్తే 
వలపులు పోసి పెంచిన తీవే..కాలసర్పమై కాటేస్తే 
మమతలు పంచిన పాల మనసే..మనసును కాస్తా విరిచేస్తే  
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి          

చరణం::3

రాయిని తీసి రవ్వగ చేసి..నా యెదపైనే నిలిపానే
రాయిని తీసి రవ్వగ చేసి..నా యెదపైనే నిలిపానే
ఆ రవ్వయె తానొక నిప్పురవ్వయై..నా యెదనే కాల్చేస్తే   

ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి  
మూగ గుండెలో రగిలే బాధ..మూగగానే మిగలాలి 
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి     

No comments: