Wednesday, August 29, 2007

జయభేరి--1959::రాగమాలిక



గానం::ఘంటసాల,P.సుశీల
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆరుద్ర


రాగమాలిక

రాగం::బేహగ్

ఆ..............
యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా !!

"మంజు ఏ ఆపేసావ్...ఏమి లేదు
ఆపకు మంజు నీ కాలి మువ్వల సవ్వడి
నా పాటకు నడక నేర్పాలి
నా గానానికి జీవం పొయ్యాలి"

రావోయి రాసవిహారి.....
యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ ఆ.......
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా !!
యమునా తీరమునా.....

బాస చేసి రావేల మదన గోపాలా
బాస చేసి రావేల మదన గోపాలా
నీవు లేని జీవితము తావి లేని పూవు కదా

యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా !!
యమునా తీరమునా.....

రాగం::కాపీ

పూపొదలో దాగనేల పో పోరా సామి
ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో
దాని చెంతకె పోరాదో

రానంత సేపు విరహమా
నేను రాగానే కలహమా ...
రాగానే కలహమా
నీ మేన సరసాల చిన్నెలు
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
దోబూచులాడితి నీతోనే
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు
ఈ కొమ్మ గురుతులు కాబోలు
నేను నమ్మనులే..
నేను నమ్మనులే నీ మాటలు
అవి కమ్మని పన్నీటి మూటలు
నా మాట నమ్మవే రాధికా
ఈ మాధవుడు నీ వాడే గా
రాధికా...మాధవా...
రాధికా...మాధవా... !!!

No comments: