Saturday, June 16, 2007

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::దేశ్:: రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు

రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,

అల్లు రామలింగయ్య.
రాగం:::దేశ్ 

పల్లవి::

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే


చరణం::1


నావలెనే నా బావకుడా నాకై తపములు చేయునులే
తపము ఫలించి నను వరియించి
తరుణములోనె విరాళ నన్ను చేరులే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే


అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే



చరణం::2

కుడికన్ను అదిరే కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచనులే
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే


చరణం::3


మల్లెతోరణముల మంటపమందె
కనులు మనసులు కలియునులే
కలసిన మనసుల కళరవళములతో
జీవితమంతా వసంతగానమౌనులే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

No comments: