Friday, August 17, 2007

ఆలీబాబా 40 దొంగలు--1970



శ్రీ గౌతమి పిక్చర్స్ వారి
దర్శకత్వం::B. విఠలాచార్య
సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, P. సుశీల.
తారాగణం::N.T. రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ


పల్లవి::

ఆమె: నాలో నీవై నీలో నేనై
అతడు: నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము

!! ఆమె: నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
!!

చరణం::1


ఆమె: పడమటి సూర్యుడు కన్నుమూసె
తూర్పున చంద్రుడు తొంగి చూసె
కారు చీకటి దారి లోనే
కాంతి విరబూసె

ఆమె: ఆ....
పెంచిన తోట మాలిని వీడి
పెరిగిన తోట తల్లిని వీడి
కన్నె మనసే తీగ లాగా
కాంతుని పెనవేసె, ప్రియ
కాంతుని పెనవేసె

!! ఆమె:నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
!!
చరణం::2


ఆమె: నీలాకాశం నీడ లోన
నిండు మమతల మేడ లోన
గాలి లాగా పూల లాగా చేరి పోదాము

అతడు: ఆహ .... ఓహో ...
వలపులోన మలుపులు లేక
బ్రతుకులోన మెలికలు లేక
వాగులున్నా వంకలున్నా
సాగి పోదాము
అతడు, ఆమె: చెలరేగి పోదాము

!! ఆమె:నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
!!

No comments: