Saturday, September 11, 2010

మల్లమ్మ కథ--1973






సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి

పల్లవి::

ఎంతటి సరసుడవో ప్రీయా..ఎంతటి చతురుడవో ప్రియా
ఎంతటి సరసుడవో ప్రీయా..ఎంతటి చతురుడవో ప్రియా
ఎంతటి సరసుడవో..

చరణం::1

నవరాగాల లహరులతో..నామనసేమో దోచేవూ
నవరాగాల లహరులతో..నామనసేమో దోచేవూ
అనురాగాల ఊయెలలో..ఆ..తారక లందించేవు
తారకలెందుకు..నీ నయనమ్ముల తళ తళలే వుంటే
వెన్నెలలెందుకు..నీ చిరునవ్వుల వేల దివ్వెలుంటే..ఏ   
ఎంతటి సరసుడవో ప్రీయా..ఆ..ఎంతటి చతురుడవో ప్రియా
ఎంతటి సరసుడవో..

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఇన్నాళ్ళుగనే దేవదాసిని..ఈనాడో నీ చరణదాసిని
ఇన్నాళ్ళుగనే దేవదాసిని..ఈనాడో నీ చరణదాసిని
ఇంతకు మించిన ఏ సిరులైనా..ఇంతకు మించిన ఏ సిరులైనా
కోరదులే..నీ హృదయవాసినీ
నీ పాద మంజీర నాదములు..నిలిచెను అభినవ వేదములై 
నీ నిత్య రమణీయ గీతికలు..నిండెను శారద చంద్రికలై  
ఎంతటి సరసుడవో ప్రియా..ఎంతటి చతురుడవో..ప్రియా
ఎంతటి సరసుడవో ప్రియా..

చరణం::3

ఆ ఆ ఆ ఆ ఆ హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కొలనులోన నిలిచిన కలువ..నెలరాయని నే వలచేనూ
కొలనులోన నిలిచిన కలువ..నెలరాయని నే వలచేనూ 
ఆ భావనలో కలువ బ్రతుకులో..ఆరని హారతి వెలిగేనూ  
పరిమళాలు సోపానమ్ములపై..పరుగిడు పున్నమి జాబిలి
అచ్చమైన నీ అనురాగానికి..అంకితమాయెను నా మదీ
అంకితమాయెను..నా మదీ     

No comments: