Sunday, September 12, 2010

మల్లమ్మ కథ--1973








సంగీతం::S.P.కోదండపాణి
రచన::వేటూరి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి

పల్లవి::

సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా 
గడసరి నాసామి..రావేలా
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా 
గడసరి నాసామి..రావేలా
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా 

చరణం::1

మల్లెలుపూచే చల్లని..వేళా 
మదిలోరేగే తీయని..జ్వాలా
మల్లెలుపూచే చల్లని..వేళా 
మదిలోరేగే తీయని..జ్వాలా
వయసే పాడే..వలపుల జోలా 
మాటవిందువని..ఏలుకొందువని
మదిని నమ్ముకొని..మరిమరి పిలిచితిని    
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా 
గడసరి నాసామి..రావేలా
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా

చరణం::2

పచ్చని సొగసూ..వాడకముందే
పరువం పల్లవి..పాడకముందే
ఏఏఏఏఏ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
పచ్చని సొగసూ..వాడకముందే
పరువం పల్లవి..పాడకముందే
పరులకుమరులే..కలుగకముందే
మనసుమార్చుకొని..దరికిచేర్చుకొని
తనివి తీర్చమని..మరి మరి వేడతిని  
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా

చరణం::3

రావే రావె రస..తరంగిణీ
రాగము నీవే..రాగ రాగిణీ 
మదిలో మెదిలె..మధుర రూపిణీ
నీ అందియల వలపు పిలుపు..విని
నా దెందమున మరులు..నిలుపుకొని
తలచి వలచి నిలిపి..పిలిచితిని
పలుకవె ఒకసారి..ఓ సుకుమారి 
తరగని వన్నెల..వయ్యారీ 
పలుకవె ఒకసారి..ఓ సుకుమారీ

No comments: