Sunday, January 09, 2011

మనుషులు - మట్టిబొమ్మలు--1974







సంగీతం::B.శంకర్
రచన::C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం:కృష్ణ,జగ్గయ్య,గుమ్మడి,అల్లు రామలింగయ్య,జమున,సావిత్రి,రమాప్రభ,జ్యోతిలక్ష్మి 

పల్లవి::

నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె
ఓ..నీలో పలికిన రాగాలన్నీ
నాలో శ్రావణ మేఘాలాయె
మ్మ్ మ్మ్..నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె

చరణం::1

అల్లరి గాలి నిమిరే దాకా 
మల్లె మొగ్గకు తెలియదు..ఏమనీ
తానొక తుమ్మెదకై తపియించేననీ
తానొక తుమ్మెదకై తపియించేననీ
మూగ కోరికా ముసిరే దాకా
మూగ కోరికా ముసిరే దాకా
మూసిన పెదవికి తెలియదు .. ఏమనీ
తానొక ముద్దుకై తహతహలాడేనని
తానొక ముద్దుకై తహతహలాడేనని
ఆ కోరికలే ఇద్దరిలోనా 
ఆ కోరికలే ఇద్దరిలోనా
కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె
ఓఓఓఓ..

చరణం::2

మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు...ఏమనీ
తానొక వధువుగా ముస్తాబైనాననీ 
తానొక వధువుగా ముస్తాబైనాననీ
ఏడు అడుగులు నడిచేదాకా
ఏడు అడుగులు నడిచేదాకా
వధూవరులకే తెలియదు..ఏమనీ
ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ 
ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ
ఆ బంధాలే ఇద్దరిలోనా 
ఆ బంధాలే ఇద్దరిలోనా
కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీలో విరిసిన అందాలన్నీ 
నా..లో వీడని బంధాలాయె
ఓ..ఓ..ఓ..
నీలో పలికిన రాగాలన్నీ 
నా..లో శ్రావణ మేఘాలాయె

No comments: