Saturday, July 28, 2007

మిస్సమ్మ--1955:::ఖరహరప్రియ::రాగం





సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి

గానం::P.సుశీల

రాగం:::ఖరహరప్రియ

బాలనురా మదనా..బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా

నిలిచిన చోటనే నిలువగ నీయక..అ అ అ అ
నిలిచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియునురా తీయని..తలపులు విరియునురా మదనా
బాలనురా మదనా...
విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా

చిలుకల వలే గోర్వంకల వలెనో..ఓ ఓ ఓ
చిలుకల వలే గోర్వంకల వలెనో
కులుకగ తోటునురా తనువున పులకలు కలుగునురా మదనా
బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా

చిలిపి కోయిలలు చిత్తములోనే..ఏ ఏ ఏ ఏ
చిలిపి కోయిలలు చిత్తములోనే
కల కల కూయునురా మనసును కలవర పరచునురా మదనా
బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా

No comments: