Sunday, February 05, 2012

ఎవరికివారే యమునాతీరే--1974


సంగీతం::చక్రవర్తి
రచన::గోపి
గానం::P.సుశీల
తారాగణం::రాజబాబు,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,కృష్ణకుమారి,గిరిజ,రోజారమణి

పల్లవి::

జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 
పాప మేమి చేశానో..కన్నులీయ మరిచావూ..ఓఓఓ 
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::1

లోకమంత వెన్నెలచేసి..చీకటిలో నను వుంచావు
వేదనతో నే నున్నానూ..వేడుకగా నువు చూచేవూ..ఓఓఓ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::2

నీవూ ఒక మనిషిగ పుడితే - నీ చూపే కరువైపోతే
నాలాగే విలపించేవూ..ప్రతి దేవుని నిందించేవూ..ఓఓఓ      
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::3

నే చేసిన నేరం చెబితే..ఆ నేరం తిరిగి చేయనూ
నే చేసిన నేరం చెబితే..ఆ నేరం తిరిగి చేయనూ 
ఈ కనుల కోసమైనా నేనూ..మరల మరల పుడుతుంటానూ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా  
పాప మేమి చేశానో..కన్నులీయ మరిచావూ..ఓఓఓ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

No comments: